Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరు ఓ కప్పు కాఫీ తాగారు.. జగన్ ముఠా మూడు చెరువుల నీళ్లు తాగింది..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (07:36 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ నగరంలో భేటీ అయ్యారు. ఈ భేటీపై వైకాపా నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. సంక్రాంతి వసూళ్ల కోసం కలిశారని ఒకరంటే.. సంక్రాంతికి గంగిరెద్దులు ఇంటికి వెళతాయని మరో మంత్రి అన్నారు. ఇలా ఏకంగా పదికిపైగా వైకాపా మంత్రులు ఈ భేటీపై నోరు పారేసుకున్నారు. వీరు చేసిన దాడికి టీడీపీ నేతలు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఒక్క టీ కప్పు కాఫీ జగన్ ముఠాను మూడు చెరువులు నీళ్లు తాగించిందంటూ తేల్చేశారు.
 
ఇదే అంశంపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు - పవన్ కళ్యాణ్‌లు ఓ కప్పు టీ తాగితే జగన్ ముఠా భయంతో మూడు చెరువులు నీళ్లు తాగిందన్నారు. బాబు, పవన్ కలిస్తే ఏడుగురు మంత్రులతో అబద్ధాల దాడి చేయించటారంటే జగన్ రెడ్డికి ఎంత వణికిపోతున్నారో అర్థమైపోతుంది అన్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ఫోటోను ట్యాగ్ చేసి ఆ ఇద్దరూ ఓ కప్పు కాఫీ తాగారు. వైకాపా వాళ్లంతూ మూడు చెరువులు నీళ్లు తాగారు అంటూ మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. బాబు, పవన్ కలిస్తే మాకు భయం లేదని చెప్పడానికి వైకాపా నుంచి అంత మంది మంత్రులు బయటకు వచ్చారంటే .. పాపం బిడ్డలు బాగా భయపడిపోతున్నారంటూ మాజీ హో మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments