Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాక్... హ్యాండిచ్చిన అంబికా కృష్ణ

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (13:41 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ, తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో అంబికా కృష్ణ బీజేపీలో చేరనున్నారు. 
 
ఇటీవలే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామమోహన్‌లు రాజ్యసభలో చేరిన విషయం తెల్సిందే. ఇపుడు అంబికా కృష్ణ కాషాయ కండువా కప్పుకోనున్నారు. వీరంతా బడా పారిశ్రామికవేత్తలు. తమ వ్యాపారం సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు, వ్యాపారంలో ఉన్న లొసుగుల నుంచి బయటపడేందుకు వీలుగానే వీరంతా బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
 
కాగా, గత 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి పీతల సుజాతపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అనంతరం తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. బాలకృష్ణతో కూడా అంబికా కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారతుండటం టీడీపీకి పెద్ద లోటనే చెప్పాలి. 
 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments