Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు : సీఎం జగన్‌కు టీడీపీ నేత అనగాని లేఖ

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేష‌న్ నిధుల మ‌ళ్లింపుపై ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. గ‌త రెండేళ్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌పై తీవ్ర నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
నిధుల మ‌ళ్లింపు ప‌థ‌కంతో బీసీల‌కు న‌య‌వంచ‌న‌ చేస్తోందని, బీసీలను ఉద్దరించేశామంటూ మోసం, దగా చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల‌లో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించారన్నారు. బీసీల నిధుల మ‌ళ్లింపు గురించి ఎందుకు మాట్లాడ‌డం లేదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, 2019-20లో రూ.15 వేల కోట్లు కేటాయించి రూ.10,478 కోట్లు మళ్లించారని, 2020-21లో రూ.23 వేల కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు మ‌ళ్లించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బీసీ కార్పొర‌ష‌న్ నుంచి రెండేళ్ల‌లో ఒక్క రుణ‌మూ ఇవ్వ‌క‌పోవ‌డం వాస్త‌వం కాదా? అని ప్రశ్నించారు. 
 
45 వేల కాపు కార్పొరేష‌న్ రుణాలు ర‌ద్దు చేయ‌డం వాస్త‌వం కాదా అని నిలదీశారు. కార్పొరేష‌న్, ఫెడ‌రేష‌న్, స‌బ్ ప్లాన్‌ల‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ హాయంలో బీసీల‌ను య‌జ‌మానులుగా చేస్తే.. ఇప్పడు సీఎం జగన్ బిచ్చ‌గాళ్లుగా మార్చారని అనగాని స‌త్య‌ప్ర‌సాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments