Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీబీ అదుపులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు... రహస్య ప్రదేశంలో...

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (08:39 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తర్వాత ఆయనను ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. 
 
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉండడంతో ఆయనను, మరి కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
 
అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఉన్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు గురువారం అర్థరాత్రి నిమ్మాడకు వంద మందికిపైగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. 
 
టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయంచింది. ఇదేసమయంలో ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై కూడా జగన్ సర్కారు దృష్టిసారించింది. ఇందులోభాగంగానే అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంది. 
 
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని, టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో టెండర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆరోపిస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments