Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు ఇసుక మాఫియాకు తెరలేపారని, ఎన్జీటీ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారనీ, ఈ తవ్వకాలపై లోతైన దర్యాప్తు జరపాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు కనకనమేడల, కె.రామ్మోహన్నాయుడులు సీబీఐ, సీవీసీలకు ఫిర్యాదు చేశారు. ప్రి బిడ్ సమావేశాన్ని కోల్‌కతాలో రహస్యంగా నిర్వహించారని వారు చేసిన తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నిబంధనలు పాటించడం లేదని వారు తమ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల బినామీలకే టెండర్లు ఇస్తున్నారని వారు పేర్కొన్నార. ప్రీబిడ్ సమావేశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం రహస్యంగా కోల్‌కతాలో నిర్వహించారని టీడీపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. 
 
కస్టమర్లకు ముద్దులు ఇవ్వాల్సిందే.. మసాజ్ సెంటర్ ఉద్యోగినిపై ఒత్తిడి  
హైదారాబాద్ నగరంలోని ఓ మసాజ్ సెంటరుకు వచ్చే కస్టమర్లకు ముద్దులు పెట్టాలని, వారు కోరినట్టుగా నడుచుకోవాలంటూ మహిళా ఉద్యోగినికి మర్దన సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటరులో నెలకు లక్ష రూపాయల వేతనంతో ఫిట్నెస్ శిక్షకురాలిగా చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ వద్దకు వచ్చే పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలని, అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి ముద్దులివ్వాలని, వారు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments