Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రాజీనామా.. కుప్పంలో లోకేశ్ పోటీ...?

Webdunia
గురువారం, 30 మే 2019 (12:45 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాతో ఏర్పడే ఖాళీతో కుప్పం స్థానం నుంచి ఆయన తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 
 
ఇటీవల వెల్లడైన ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మంగళగిరిలో నారా లోకేశ్ కూడా ఓడిపోయారు. పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు మాత్రం ఓటమి అంచులకు వెళ్లి తిరిగి గట్టెక్కారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ వారంలో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజీనామా చేస్తారని, లోకేశ్‌ కుప్పం వస్తారని వినిపిస్తున్న వదంతులను ఖండించారు. అవి పూర్తిగా సత్యదూరమన్నారు. ఆయన ఇక పూర్తిగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తారన్నారు. 
 
వచ్చేనెల పర్యటనలో చంద్రబాబు పంచాయతీల వారీగా పర్యటించి, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతారన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలు వినడమేకాకుండా ఆయా పంచాయతీల వారీగా పార్టీ స్థితిగతులపై ఇప్పటికే తనకున్న సమాచారం మేరకు ఆరాతీసి, ఎక్కడ ఎటువంటి మార్పుచేర్పులు చేయాలో ఒక అవగాహనకు వస్తారన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని విడిచిపెట్టే పరిస్థితే లేదని మనోహర్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments