Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో పంట అమ్మకానికి అడ్డంకులు.. స్వేచ్ఛగా మద్యం విక్రయాలు

Webdunia
బుధవారం, 6 మే 2020 (13:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. కానీ, రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో రైతులు తాము పండించిన పంటను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. ఈ దారుణం కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ విషయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?" అంటూ నిలదీశారు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments