Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలవి రోడ్లు వేసే మొహాలేనా? టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (14:42 IST)
వైకాపా నేతలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతతో పరిపాలన ప్రారంభించన వైఎస్ జగన్ పాలన విధ్వంసంగానే సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో గృహాలను కూల్చిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రోడ్డు వేసే మొహాలు ఇవేనా అంటూ సెటైర్ వేశారు. 
 
ఈ వైకాపా ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డివి వంద తప్పులు దాటాయని, ఇగ మిగిలింది ప్రభుత్వ పతనమేనని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అరెస్టులు, అహంకారం, అడ్డగింతలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. సీఎం అధికార దాహానికి, అహంకారానికి జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
కేవలం 600 ఇల్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రహదారి వేస్తారా అని నిలదీశారు. ఇది కక్ష సాధింపు కాకుంటే మరేంటని ఆయన ప్రశ్నించారు. "ఇప్పటం గ్రామానికి వెళుతున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునే, చీకట్లో తన రోడ్‌షోలో రాళ్లు రువ్వితోనే మీరు సాధించబోయేది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments