Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిక్కారెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరిపించండి : డీజీపీకి బాబు లేఖ

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డిపై జరిగిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బాబు తన లేఖలో కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు.
 
డీజీపీకి సవాంగ్‌కు ఆదివారం రాసిన లేఖలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
కాగా, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తాజాగా జరిగిన పెద్ద బొంపల్లి జాతరలో పాల్గొన్న తిక్కారెడ్డిపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. ఇందులో తిక్కారెడ్డి తలకు బలమైన దెబ్బతగిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments