Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిక్కారెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరిపించండి : డీజీపీకి బాబు లేఖ

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డిపై జరిగిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బాబు తన లేఖలో కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు.
 
డీజీపీకి సవాంగ్‌కు ఆదివారం రాసిన లేఖలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
కాగా, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తాజాగా జరిగిన పెద్ద బొంపల్లి జాతరలో పాల్గొన్న తిక్కారెడ్డిపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. ఇందులో తిక్కారెడ్డి తలకు బలమైన దెబ్బతగిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments