Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల తర్వాత నగరిపల్లెలో చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (09:40 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రూ జిల్లాలోని నగరిపల్లెకు 40 యేళ్ల తర్వాత వచ్చారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని చంద్రబాబు స్వీకరించి, ఆయన కుటుంబ సభ్యులను పలుకరించారు. 
 
చంద్రబాబు 40 యేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో నగరిపల్లెకు వచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆయన ఆ గ్రామానికి రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మహిళలు మంగళ హారతులు పెట్టి స్వాగతం పలికారు. 
 
కాగా, గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డిని కలుసుకునేందుకు ఈ గ్రామానికి వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments