Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటుడు శివాజీ గణేశన్ కుమారులపై మోసం కేసు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (09:32 IST)
తమిళ చిత్రపరిశ్రమలో మహానటుడుగా గుర్తింపు పొందిన దివంగత శివాజీ గణేశన్‌ కుమారులైన హీరో ప్రభు, నటుడు రామ్ కుమారులపై మోసం కేసు నమోదైంది. ఈ కేసును వారి చెల్లెళ్లు అయిన శాంతి, రాజ్వీలు చేశారు. ఈ మేరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా మోసం చేశారంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశ్‌ కుమారులు ప్రభు, రామ్‌కుమార్‌, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
తమకు తెలియకుండా ఆస్తులను విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలన్నారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్‌కుమార్ అపరిహరించారని, శాంతి థియేటర్‌లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాలను వారిద్దరి పేరిటకు మార్చుకున్నట్లు ఆరోపించారు. 
 
శివాజీ గణేశన్ రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్‌ పవర్ ఆఫ్‌ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్‌లతో పాటు వారి కుమారులు విక్రమ్‌ ప్రభు, దుశ్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ప్రభు, రామ్ కుమారులు మోసం చేశారంటూ వారి చెల్లెళ్లు కోర్టును ఆశ్రయించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments