Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : చంద్రబాబు ధ్వజం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కాళ్లపైనుంచి పోలీసు జీపు వెళ్లిన ఘటన రాష్ట్ర00 వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఘటనపై పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గాడితప్పిన ప్రతి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంతో పాటు సిగ్గుగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments