Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
సోమవారం, 2 మే 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లేవారిని పోలీసులే పట్టుకుని చితకబాదుతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేపాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని ఫలితంగా ప్రజలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments