Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.. అచ్చెన్న

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:34 IST)
రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడెపుడు వస్తాయా.. అపుడు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. 
 
అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమన్నారు. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉండగా మరణిస్తే.. ఆ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని తెదేపా పాటిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
"మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబీకులు ఉప ఎన్నికల్లో నిలబడితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ అంశంపై తమ విధానమేంటో వైకాపా స్పష్టం చేయాలి. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి ఆత్మకూరు సీటు కేటాయిస్తే.. తెదేపా తప్పక పోటీలో నిలబడేది. మా సత్తా ఎంతో చూపేవాళ్లం" అని అన్నారు.
 
పైగా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా వైకాపాను బంగాళాఖాతంలో విసిరేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా వాళ్లు అనవసర సవాళ్లు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని వైకాపా పాలకులకు అచ్చెన్నాయుడు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments