Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.. అచ్చెన్న

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:34 IST)
రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడెపుడు వస్తాయా.. అపుడు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. 
 
అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమన్నారు. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉండగా మరణిస్తే.. ఆ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని తెదేపా పాటిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
"మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబీకులు ఉప ఎన్నికల్లో నిలబడితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ అంశంపై తమ విధానమేంటో వైకాపా స్పష్టం చేయాలి. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి ఆత్మకూరు సీటు కేటాయిస్తే.. తెదేపా తప్పక పోటీలో నిలబడేది. మా సత్తా ఎంతో చూపేవాళ్లం" అని అన్నారు.
 
పైగా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా వైకాపాను బంగాళాఖాతంలో విసిరేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా వాళ్లు అనవసర సవాళ్లు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని వైకాపా పాలకులకు అచ్చెన్నాయుడు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments