వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.. అచ్చెన్న

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:34 IST)
రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడెపుడు వస్తాయా.. అపుడు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. 
 
అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమన్నారు. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉండగా మరణిస్తే.. ఆ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని తెదేపా పాటిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
"మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబీకులు ఉప ఎన్నికల్లో నిలబడితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ అంశంపై తమ విధానమేంటో వైకాపా స్పష్టం చేయాలి. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి ఆత్మకూరు సీటు కేటాయిస్తే.. తెదేపా తప్పక పోటీలో నిలబడేది. మా సత్తా ఎంతో చూపేవాళ్లం" అని అన్నారు.
 
పైగా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా వైకాపాను బంగాళాఖాతంలో విసిరేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా వాళ్లు అనవసర సవాళ్లు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని వైకాపా పాలకులకు అచ్చెన్నాయుడు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments