జగన్ నుంచి బొత్సకు ప్రాణహాని : పల్లా శ్రీనివాస రావు

ఠాగూర్
ఆదివారం, 12 అక్టోబరు 2025 (13:46 IST)
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని పొంచివుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శాసనమండలిలో బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ నుంచే ఆయకు ప్రాణహాని ఉన్నట్టుగా ఉందనిపిస్తోందని అన్నారు. 
 
పార్టీలో తనను దాటి వెళ్లినా, ఎక్కువ పేరు తెచ్చుకున్నా జగన్‌ వాళ్లను అంతం చేస్తారనే ఆరోపణలున్నాయని అన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని అలాగే అంతమొందించారని అంతా అనుకుంటున్నారని పేర్కొన్నారు. 
 
'ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్‌ అవుతున్నారు. ఆయనకు వైకాపా నుంచే ప్రాణహాని ఉందనిపిస్తోంది. కావాలంటే ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తాం. కూటమి ప్రభుత్వంలో మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. 
 
రాష్ట్రంలో గూగుల్, టీసీఎస్, మహీంద్ర, లులు, రిలయన్స్‌ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సీఎం చంద్రబాబు దార్శనికతే కారణం. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటు కానుంది' అని పల్లా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments