Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌కు రానున్న టీసీఎస్-టాటా.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (07:56 IST)
టాటా గ్రూప్ ప్రతినిధులతో భేటీపై ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ రానున్నట్లు మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఐటీ సదుపాయం 10,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని.. ఇప్పటివరకు ఏపీలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా నిలుస్తుందన్నారు నారా లోకేష్. 
 
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వైజాగ్‌లో 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సదుపాయాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
 
వ్యాపారం చేయడంలో వేగం అనే నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 
 
ఏపీని భారతదేశంలో నంబర్-1 రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వైజాగ్‌లో టిసిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్‌డిఎ హయాంలో ఏపీకి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆసక్తిగా రజనీ హంటర్.. ఫస్ట్ ఆఫ్ రివ్యూ

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు- చిరంజీవి

రతన్ టాటా మృతిపై ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్...

నయనతార, విఘ్నేష్ శివన్.. ఓటీటీలో డాక్యుమెంటరీ

తమిళ టైటిల్ వేట్టయన్ ది హంటర్ పై సురేష్ బాబు, దిల్ రాజు, రానా దగ్గుబాటి వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments