Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:11 IST)
హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ నెల 5వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను స్ఫూర్తిగా తీసుకున్న ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును హైజాక్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాధిక్ అనే వ్యక్తి ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి 'పుష్ప-2' చూసి బస్టాండులోని బస్సులోనే నిద్రించాడు. అయితే, బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరుకు వరకు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన ఆపి మళ్లీ నిద్రపోయాడు. 
 
అయితే, బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments