Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:11 IST)
హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ నెల 5వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను స్ఫూర్తిగా తీసుకున్న ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును హైజాక్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాధిక్ అనే వ్యక్తి ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి 'పుష్ప-2' చూసి బస్టాండులోని బస్సులోనే నిద్రించాడు. అయితే, బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరుకు వరకు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన ఆపి మళ్లీ నిద్రపోయాడు. 
 
అయితే, బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments