Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ప్రజల దాహార్తిని తీర్చండి... సీఎం జగన్ ఆదేశం

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (14:46 IST)
తాగు నీటి కోసం అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళనాడు మంత్రుల బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. తాగడానికి నీళ్లు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
చెన్నైలో నీటి కష్టాలను సీఎంకు తమిళనాడు మంత్రుల బృందం వివరించింది. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్‌.జగన్‌ వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించిటనట్టు సమాచారం. 
 
ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని, ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలనీ, అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 
అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆయన అధికారులను ఆదేశించారు. 
 
చెన్నైకి తాగునీటి జలాలు ఇస్తన్నందుకు తమిళనాడు మంత్రుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. చెన్నైలోని 90 లక్షల మంది ప్రజల ఆశీస్సులు సీఎం వైయస్‌.జగన్‌కు ఉంటాయన్న తమిళనాడు మంత్రుల బృందం... తాము అడగ్గానే మానవత్వంతో స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
కాగా, సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రుల బృందంలో తమిళనాడు మున్సిపల్‌ శాఖమంత్రి వేలుమణి, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖమంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌‌ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments