Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరగడుపున మంచినీరు తాగితే ఏం జరుగుతుంది?

Advertiesment
Benefits
, బుధవారం, 24 జులై 2019 (22:08 IST)
పరగడుపున మంచినీరు తాగడం వలన మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పని చేస్తుందని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగడం వలన కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
 
2. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్దిని పెంచుతుంది.
 
3. ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
4. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలుగుతాయి. దానితో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజూవారీ పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా, శరీర ద్రవ పదార్దాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాపిల్ తింటే బ్యాక్టీరియాను ఆరగించినట్టేనా?