Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేసిన లెక్చరర్ - ఆత్మహత్య చేసుకున్న యువతి

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (12:53 IST)
ప్రేమ పేరుతో ఓ యువతిని లెక్చరర్ ఒకరు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆ యువతి ప్రేమికుడి మోసాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని నల్లాటూరుకు చెందిన మణి కుమార్తె మణిమేగలై (21) తాళవేడుకు చెందిన మునిరత్నం కుమారుడు రాజ్‌కుమార్‌ (26)నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. 
 
వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి కూడా తొందరపడింది. ఈ క్రమంలో యువతిని శారీరకంగా వాడుకున్న రాజ్‌కుమార్.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, అందుకు నిరాకరించాడు.
 
దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంచుకొని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదుచేసి రాజ్‌కుమార్‌కు విచారిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments