Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షల వేళ తగు జాగ్రత్తలు పాటించండి: విద్యార్థులకు ప్రభుత్వ సూచన

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:12 IST)
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్  నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ జాగ్రత్త వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో సూచించారు.

పరీక్ష హాలు, కాలేజ్/స్కూల్ క్యాంపస్లోనూ, ఇతర బహిరంగ ప్రదేశాలలోనూ ప్రతి విద్యార్థీ తన ముక్కు, నోరు మూసి వుండే విధంగా మాస్క్ లు ధరించాలని, ఇతరులనుండి కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని, తమ చేతులను తరచు శుభ్రపర్చుకోవాలని ఆయన సూచించారు.

పరీక్షహాలులోకి ప్రవేశించే సమయంలోనూ, నిష్క్రమించే సమయంలోనూ విద్యార్థులు ఇతరులు నుండి సురక్షిత భౌతక దూరాన్ని పాటించాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్  నిబంధనలను విద్యార్థులు సమగ్రంగా అవగాహన చేసుకుని పాటించే విధంగా తల్లిదండ్రులు వారిని చైతన్యవంతం చేయాలని ఆయన సూచించారు.

కోవిడ్ ప్రోటోకాల్  నిబంధనల అమలు విషయంలో ఎటువంటి రాజీ పడకుండా స్కూల్ యాజమాన్యాలు తగినవిధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments