Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ : న్యాయ సలహా కోరిన గవర్నర్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మించతలపెట్టింది. అలాగే, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం బిల్లులు తెచ్చి, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అక్కడ సంపూర్ణ మెజార్టీ ఉండటంతో వాటిని పాస్ చేయించుకుంది. కానీ, శాసనమండలిలో మాత్రం ఆ బిల్లులకు చుక్కెదురైంది. 
 
ఈ క్రమంలో ఇపుడు మూడు రాజధాను బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. వీటిని పరిశీలించిన గవర్నర్.. న్యాయసలహాను కోరారు. 
 
అంతకుముందు.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నరును కలిసి.. బిల్లుల ఆవశ్యకతో పాటు.. మూడు రాజధానులతో పాలనను వికేంద్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ బిల్లులు అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై గవర్నరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments