Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

సెల్వి
శనివారం, 18 మే 2024 (14:25 IST)
కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించేందుకు ఆ యువతి ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మరణించి ఒక రోజు గడిచినా యువతిని వెంటిలేటర్‌పై ఉంచామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి శుక్రవారం మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. 
 
విజయవాడ గాంధీనగర్‌కు చెందిన పేర్ల లక్ష్మీ వెంకట రితిక (18) నందిగామ మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది. రితికకు చిన్నప్పటి నుంచి కాళ్లు వంకరగా వుండటంతో 2019లో విజయవాడ నగరంలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేసి ప్లేట్లు అమర్చారు. 
 
ఈ క్రమంలో కాలిలోని ప్లేట్లను తీసేయాలని వైద్యులు సూచించడంతో సర్జరీ కోసం బుధవారం యువతిని ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. అయితే మత్తు వికటించిందని వెంటిలేటర్‌పై వుంచామని చెప్పి.. చివరికి రితిక మరణించిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబీకులు బాధలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments