Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పితో ఆపరేషన్ చేసుకుంటే.. కత్తెరను పెట్టి కుట్టేశారు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (12:03 IST)
కడుపునొప్పితో అల్లాడిపోయి ఓ మహిళ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ వైద్యులు ఆపరేషన్ చేస్తూ చేస్తూ ఆమె కడుపులోనే కత్తిరిని మరిచిపోయారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం నిమ్స్ ఆస్పత్రితో ఆపరేషన్ చేయించున్నారు. 
 
కానీ ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అంతేగాకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు శనివారం స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్‌లో తన కడుపులో కత్తెర వున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని విని మహేశ్వరి షాకయ్యారు. 
 
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ కేసు కన్జ్యూమర్ కోర్టులో విచారణకు రానుంది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments