Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది : సురేష్ ప్రభు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (21:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, బీజేపీ భ్యుడు సురేష్ ప్రభు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందని వ్యాఖ్యానించారు. పైగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, చేయిదాటక ముందే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ మేరకు విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో.. దేశంలోని పలు రాష్ట్రాలు అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు పరిధిని దాటి పోయాయని చెప్పారు. ఈ అప్పులను సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని తెలిపారు. 
 
అభివృద్ధి పథకాలకు వాడాల్సిన నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తే... అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటి దిగజారక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments