Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు లోపు అమరావతి పిటిషన్లపై విచారణ కదురదు : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (14:42 IST)
ఏపీ రాజధాని అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ డిసెంబరులోపు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై డిసెంబరులో విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణను అత్యవసరంగా విచారించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 
 
ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సివుందని, నవంబర్ వరకు ఈ కేసుల విచారణ జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును పరిశీలించి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది. 
 
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆరు నెలల్లో అమరావతి రాజాధానిని నిర్మించాలన్న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్‌కు బదిలీ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments