Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాతో చెలిమి... సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దల షాక్

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (15:27 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలతో అంటకాగినందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దలు తేరుకోలేని షాకిచ్చారు. ఇన్‍చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఐదేళ్లుగా పార్టీపరంగా ఏపీకి అందించిన సేవలు చాలంటూ ఉద్వాసన పలికింది. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా తన బృందంలో సునీల్‌కు చోటివ్వలేదు. 
 
మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవ్‌ధర్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్ షా ఆయనను నియమించారు. 2018, జూలై 30న రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా నియమిచారు. అయితే ఏపీలో సునీల్ సేవలు ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో దేవ్‌ధర్ పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపించాయి. 
 
ముఖ్యంగా మీడియా ముందు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెలిమి చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న వై.సత్యకుమార్ను అదేస్థానంలో కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments