Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 24వ తేదీ నుంచి తెలంగాణాలో స్కూల్స్ సెలవు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 7 నుంచి 9వ తరగతులకు చెందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, 23వ తేదీన పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ నుంచి స్కూల్స్ సెలవులు ఇవ్వనున్నారు. 
 
నిజానికి మే నెలలో పదో తరగతి విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత వేస‌వి సెల‌వులు ఇచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందినా.. రోజురోజుకీ ఎండ వేడిమి పెరిగిపోతున్న‌ నేప‌థ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఏప్రిల్ 7 నుంచే 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్షా ఫ‌లితాల‌ను 23లోగా విడుద‌ల చేయ‌నున్నారు. ఆ మ‌రునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే వేస‌వి సెల‌వులు మొద‌లు కానున్నాయి. 
 
భారీగా పెరిగిన ఎండ వేడిమి నేపథ్యంలో ఇప్ప‌టికే మొద‌లైన ఒంటిపూట బ‌డుల‌ను కూడా గురువారం నుంచి ఉద‌యం 11.30 గంట‌ల‌కే ముగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ వెంట‌నే వేస‌వి సెల‌వుల‌పైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments