Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక మృతిపై విచారణ నివేదిక సమర్పించండి: విశాఖ సీపీ కి ఏపీ మహిళా కమిషన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:09 IST)
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై ఏపీ మహిళా కమిషన్ దృష్టి సారించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలపై విచారణ నివేదిక కోరుతూ విశాఖ పోలీసు కమిషనర్ కు లేఖ రాసింది.

పావని మృతి సంఘటన రోజే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. కమిషన్ సభ్యురాలు సైతం ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం... అనంతరం బాలిక మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఈ విషయంపై మరోమారు స్పందించారు.   

బాలిక మృతి ఆత్మహత్యనా.. హత్యనా అనే విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments