Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో విద్యార్థుల నిరాహార దీక్ష భగ్నం

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:18 IST)
తుళ్లూరు మండలం వెలగపూడిలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ 151 గంటలు నిరాహారదీక్ష చేపట్టి దీక్ష చేస్తున్న ఇద్దరు యువకుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. 
 
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి. మందడం తుళ్లూరు రాయపూడి తాడికొండ గ్రామాల్లో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
వెలగపూడిలో 55 వరోజు రిలేనిరాహారదీక్ష కొనసాగుతుంది. వెలగపూడిలో గత 5 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఇద్దరు యువకులు బొర్రా రవిచంద్ర, తాడికొండ శ్రీకర్‌ల అప్పటికే 112 గంటలు పూర్తయిన నేపథ్యంలో దీక్షలను ఆదివారం అర్థరాత్రి పోలీసులు భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
 
తుళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన డాక్టర్లు వెలగపూడిలోని దీక్షా శిబిరానికి వచ్చి దీక్ష చేస్తున్న ఇద్దరి యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు గుర్తించారు. 
 
దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారి దీక్షను భగ్నం చేసి చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సెలైన్ పెట్టి ప్రథమ చికిత్స అందిస్తున్నారు ఆ ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉంది అనీ ఆందోళనలో ఉన్న రాజధాని 29 గ్రామాల ప్రజలు అమరావతి రైతులు మహిళలు కుటుంభ సభ్యులు జేఏసీ నాయకులు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments