Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నేటిలో ఈత‌కు వెళ్ళి... పాపం! 12 ఏళ్ల బాలురు అయిదుగురి మృతి

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (10:45 IST)
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో 5 గురు చిన్నారులు గల్లంత‌య్యారు. వారంతా మృతి చెందార‌ని స‌మాచారం అందింది. గ‌ల్లంత‌యిన విషయం తెలుసుకున్నఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ రెస్క్యూ టీంను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. కానీ, వారంతా ఈత రాక మునిగి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అందులో న‌లుగురు విద్యార్థుల మృత దేహాల‌ను వెలికితీశారు.
 
 
గల్లంతైన విద్యార్థులు చరణ్, బాలయేసు, స‌న్నీ, అజయ్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నారు. ఇందులో న‌లుగురి మృత దేహాలు దొరికాయి. 
మున్నేరువాగులో ఈత కోసం వెళ్లిన చిన్నారులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ అంతా 12 సంవత్సరాల లోపు వారే. గల్లంతైన ఐదుగురు దుర్మరణం కావ‌డంతో గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. చిన్నారుల కోసం విస్తృతంగా గాలింపు జరిపిన ఎన్డిఆర్ఎఫ్, న‌లుగురి మృత‌దేహాల‌ను వెంట‌నే వెలికితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments