Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ టీచర్లకు జీతాలివ్వని స్కూళ్లపై కఠిన చర్యలు, ఏపీ సర్కార్ ఆదేశాలు

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:46 IST)
కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఏపీ లోని ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాన్ని కనుమరుగున పడేసింది. కరోనా ప్రభావం వల్ల అనేక పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తర్వాత అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి. అయినా మార్చి నెల నుంచి టీచర్లకు జీతమివ్వకుండా వారి సేవలను మాత్రం వాడుకుంటున్నాయి. దీంతో టీచర్లు రోడ్డున పడుతున్నారు.
 
దీనిపై సర్వత్రా వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. ఏపీలో టీచర్లకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. టీచర్లకు జీతాలు ఇవ్వని పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని తెలిపింది. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
 
లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదని వాటిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయులకు జీతాలు ఇప్పించే బాధ్యత డీఈవోలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments