Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలుత జగన్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:18 IST)
వచ్చేనెల నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ, ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్  ఆదేశాలు జారీ చేశారు.

తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించ నున్నారు. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు.

అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఇన్ చార్జీ మంత్రులు,మంత్రులు,జిల్లా కలెక్టర్లు రాష్ట్ర  అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.

అలాగే  రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments