Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పెట్టుబడులకు సిద్ధం: పోస్కో

Advertiesment
invest
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:08 IST)
రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు.

రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం వివరించారు.

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటు నందిస్తాయన్నారు.  పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో  పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ట్రెచర్ పైన శృంగారం చేద్దామన్న నర్సు, భయంతో ఆ పని చేసిన వార్డు బాయ్