Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (20:39 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని ముందుగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను ఈసారి కూడా  ఏకాంతంగానే నిర్వహించనునన్నట్లు మంగళవారం తితిదే ప్రకటించింది. ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన తితిదే ఉన్నతాధికారులు పలు మార్లు సమీక్షలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటం.. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు  స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments