Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామంలో బట్టలు ఉతకబోమని దండోరా వేసిన రజకులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ వలంటీర్ల పోస్టుల నియామకం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఓ వలంటీర్ చొప్పున నియమించనున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 100 గృహాలకు ఒక వలంటీర్‌ను ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ వలంటీర్ పోస్టుల ఎంపిక గ్రామంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రజకులు మాసిన బట్టలు ఉతకరాదని తీర్మానించారు. ఈ విషయాన్ని చాటింపు వేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీవాడ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామంలో గ్రామ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో తాము ఉంటున్న కాలనీలో తమ కులస్తుడికికాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామంలోని రజకులంతా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ కులస్తుడికికాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టు ఇచ్చినందుకు శనివారం నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాట గ్రామంలో దండోరా వేయించారు. దీనిపై గ్రామ పెద్దలు లేదా మండల అధికారులు నోరుమెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments