Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామంలో బట్టలు ఉతకబోమని దండోరా వేసిన రజకులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ వలంటీర్ల పోస్టుల నియామకం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఓ వలంటీర్ చొప్పున నియమించనున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి 100 గృహాలకు ఒక వలంటీర్‌ను ఎంపిక చేయనున్నారు. 
 
అయితే, ఈ వలంటీర్ పోస్టుల ఎంపిక గ్రామంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆ గ్రామానికి చెందిన రజకులు మాసిన బట్టలు ఉతకరాదని తీర్మానించారు. ఈ విషయాన్ని చాటింపు వేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీవాడ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామంలో గ్రామ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో తాము ఉంటున్న కాలనీలో తమ కులస్తుడికికాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామంలోని రజకులంతా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ కులస్తుడికికాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టు ఇచ్చినందుకు శనివారం నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాట గ్రామంలో దండోరా వేయించారు. దీనిపై గ్రామ పెద్దలు లేదా మండల అధికారులు నోరుమెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments