Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళంవాసి మృతి

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:48 IST)
అమెరికాలో విషాదం నెలకొంది. అగ్రరాజ్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం సీమన్ కంపెనీలో చేరిన రవికుమార్ అనే యువకుడు కంటెయినర్ నుంచి జారిపడి మృతి చెందాడు. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్ (35)గా గుర్తించారు. ఈయన సీమన్ కంపెనీలో మూడు రోజుల క్రితం ఉద్యోగంలో చేశారు. నౌకలో పని చేసేందుకు మొత్తం 10 మందితో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. 
 
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా, ప్రమాదవశాత్తు కంటెయినరు పైనుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments