Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:31 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతి చెందారు. బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాత్రూమ్‌లో కాలు జారి పడటంతో ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బీఎస్ రావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు. బీఎస్ రావు కుమార్తె సీమ విదేశాల్లో వున్నారు. ఆమె వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంగ్లండ్, ఇరాన్ వైద్యులుగా సేవలు అందించిన బీఎస్ రావు దంపతులు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. 
 
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు శ్రీ చైతన్య కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments