ఆంధ్రాలో ఆ 3 జిల్లాల్లో లాక్డౌన్.. మాస్క్ లేకుంటే క్వారంటైన్‌కే...

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ముఖ్యంగా, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో ఆదివారం నుంచి లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
అయితే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే కిరాణా సరకుల షాపులు తెరిచివుంచుతారు. అదేసమయంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేయనున్నారు.
 
దీనికి కారణం లేకపోలేదు. గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కు చేరుకున్నాయి. వీటికి కొత్త కేసులు అదనం. 
 
మరోవైపు, అనంతపురం జిల్లా పోలీసులు లాక్డౌన్ వేళ మరింత కఠినంగా ఉండనున్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించనున్నట్టు ప్రకటించారు. 
 
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం ఇవేం పట్టించుకోకుండా, యధేచ్చగా లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అలాగే, సామాజికి భౌతిక దూరాన్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments