Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేం: కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (13:46 IST)
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్‍నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ ఈ సమాధానం చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
 
ఏపికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ఓట్లు అడిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి సమాధానం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ప్రత్యేక హోదా ఎజెండాగా సాగిన గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీని తీవ్రాతి తీవ్రంగా విమర్శించింది.
 
టీడీపీ రాజకీయ అవసరాల కోసం బిజెపి వద్ద మోకరిల్లడం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటిలో తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పినందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments