Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (12:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం సందర్శకులను అమితంగా ఆకర్షించింది. 
 
ఏటికొప్పాక బొమ్మలు.. ఆంధ్రప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు.. దేశవిదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఈ కళాఖండాలు ఉంటాయి. 
 
ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం మైమరిపించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకటం రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments