Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి వంతెనపై వెళ్లే రైళ్ల వేగం పెంపు

Webdunia
గురువారం, 28 జులై 2022 (12:42 IST)
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న వంతెనపై వెళ్లే రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ పట్టాల కింద ఉండే స్లీపర్లను అధికారులు పూర్తిగా మార్చేశారు. దీంతోపాటు ట్రాక్‌ను మరింత పటిష్టం చేశారు. ఫలితంగా ఈ వంతెనపై వెళ్లే అన్ని రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచారు. 
 
కాగా, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల మేరకు రైలు వంతెన ఉంది. ఈ వంతెనపై గంటకు 30 కిలోమీటర్ల వేగంతోనే రైళ్ళు ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఇపుడు రైలు పట్టాల కింద ఉన్న స్లీపర్స్‌ను మార్చడంతో పాటు వంతెనను మరింత పటిష్టం చేశారు. 
 
ఫలితంగా ఈ వంతెనపై రైళ్ళు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేందుకు గత ఏప్రిల్ నెలలోనే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇపుడు ఆ వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా రద్దీ తగ్గుతుందని, సమయపాలన పెరుగుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments