Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో తిరుమల ఘాట్‌ రోడ్లపైకి ఎలక్ట్రికల్‌ బస్సులు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (12:40 IST)
పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా తిరుమల ఘాట్‌రోడ్లపై త్వరలో ఎలక్ర్టికల్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. తిరుపతి, తిరుమల అర్బన్‌ పరిధిలో మొత్తం 100 ఈ- బస్సులు, తిరుపతి- తిరుమల మార్గంలో మరో 50 ఎలక్ర్టికల్‌ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధమైంది.

వీటితో పాటు తిరుపతి సమీప ప్రాంతాలైన కడప, నెల్లూరు, మదనపల్లి, చిత్తూరు, రేణిగుంట నుంచి మరో 50 ఈ- బస్సులు తిరుమలకు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఎలక్ర్టికల్‌ బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ చకాచకా ఏర్పాట్లు చేస్తోంది.

పవిత్ర శ్రీవారి క్షేత్రంలో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టి, భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎలక్ర్టికల్‌ బస్సులు ఏర్పాటుకానున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం  ప్రైవేటు ట్రాన్స్‌పోర్టర్ల నుంచి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనుంది.

ఎలక్ర్టికల్‌ బస్సులు నడపడంపై ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా పలు కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ బస్సులు రోడ్డెక్కేందుకు మార్గం సుగమమైంది. తిరుపతి- తిరుమల తరహాలోనే తదుపరి దశలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో కూడా ఈ బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments