Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:45 IST)
మేము సాఫ్ట్‌గా ఉన్నాం కదా అని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే చూస్తూ ఊరుకోము అని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు సోము వీర్రాజు.
 
చిత్తూరు జిల్లా రేణిగుంటలో జనసేన పార్టీ నాయకురాలు నగరం వినూతను పరామర్శించారు సోము వీర్రాజు. వినూత ఇంటిపై వైసిపి కార్యకర్త శివ దాడి చేసి కారు అద్దాలతో పాటు ఇంటిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో సోము వీర్రాజు రేణిగుంటకు చేరుకున్నారు.
 
ఎపిలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తాబేదారులుగా మారిపోయారని విమర్సించారు. జనసేన పార్టీ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments