Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (17:14 IST)
కర్నూలు జిల్లాలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకంగా జరిగింది. ఈ శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా అంటూ సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నించారు. 
 
అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీకు కళ్లు కనిపించడం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలం దేవాస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. 
 
ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తానే స్వయంగా పర్యటిస్తానని ప్రజా క్షేత్రంలో మీ నిరంకుస వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments