Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు, అధికారులకు సోమిరెడ్డి వార్నింగ్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (09:23 IST)
అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదమనుకుంటూ అడ్డగోలుగా వ్యవహరించడం అధికారులకు తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో పేదలకు రక్షణ, మానసిక ప్రశాంతత కరువైందని అన్నారు. టీడీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి వెంటపడి వేధిస్తారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కొందరు పోలీస్, రెవెన్యూ అధికారుల పనితీరుకు చెర్లోపల్లి ఘటన పరాకాష్ట అని మండిపడ్డారు.

బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేసి దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులు తేవడం దురదృష్టకరమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులే దీనికి బాధ్యత వహించాలని సోమిరెడ్డి సూచించారు.

'అన్ని ప్రాంతాల్లోనూ దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేయడం అన్యాయం. జిల్లాలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారుల పనితీరు దారుణంగా ఉంది. కొందరు పేదలను మానసికంగా హింసిస్తున్నారు. దళిత, గిరిజన, బడుగుబలహీన వర్గాల ప్రజల జోలికి వెళ్లొద్దు.

పదేపదే వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్, ఎస్పీలు విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలి' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments