గుంటూరులో విషాదం - ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (15:45 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒక ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వట్టి చెరుకూరులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృత్యువాతపడగా, మరో 20 మంది గాయపడ్డారు. 
 
మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ట్రాక్టరులో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం డెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, గాయపడిన వారిలో అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments