Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో విషాదం - ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (15:45 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒక ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వట్టి చెరుకూరులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృత్యువాతపడగా, మరో 20 మంది గాయపడ్డారు. 
 
మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ట్రాక్టరులో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం డెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, గాయపడిన వారిలో అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments