Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లు వున్నాయని చెప్తే.. 100 నిమిషాల్లో? శివాజీ

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కోట్లు ఉన్నాయని ఒకవేళ తాను చెబితే.. వంద నిమిషాల్లో అక్కడకు వెళ్లి.. వారి ఫామ్ హౌస్‌లో సోదాలు చేస్తారా అని హీరో శివాజీ అన్నారు. ఒక్క కేసీఆరే కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్ రెడ్డి ఇంట్లోనే సోదాలు చేయాలన్నారు. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. 
 
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సోదాలు లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని శివాజీ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఐటీ, జీఎస్టీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బులు తీసుకెళ్తున్నా... సీజ్ చేస్తున్నారని హీరో శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఐటీ, జీఎస్టీ దాడులతో బెంబేలెత్తిస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని ద్వివేదీ తనకు చెప్పారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments