Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:35 IST)
సెల్ ఫోన్లతో ఉపయోగాలు ఎన్ని వున్నాయో నష్టాలు కూడా అన్నే వున్నాయి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి చాలామంది టీనేజ్ పిల్లలు తాము ఏం చేస్తున్నామో పట్టించుకోవడంలేదు. మరికొందరైతే సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవికాకుండా సెల్ ఫోన్ల కోసం పిల్లల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు పోయాయి.
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన 13 ఏళ్ల గోరంట్ల విజయలక్ష్మి ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో తల్లి, అన్నయ్యలతో కలిసి అమ్మమ్మగారి ఊరు ఉప్పలపాడుకు వచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య మంగళవారం నాడు స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో తోపులాట జరిగింది. తనకు ఫోన్ చూపించాలంటూ విజయలక్ష్మి అన్నయ్యను అడిగింది. 
 
అందుకు అతడు ససేమిరా అనడమే కాకుండా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న చెల్లెల్ని బలంగా తోసేశాడు. అంతే... ఆమె తల నేలకి బలంగా తగిలింది. దీంతో ఆమె పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విజయలక్ష్మి క్రీడల్లో ఛాంపియన్‌గా పలు బహుమతులు అందుకుంది. కేవలం స్మార్ట్ ఫోన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటిల్లపాది శోకంలో మునిగిపోయారు.‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments