Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:35 IST)
సెల్ ఫోన్లతో ఉపయోగాలు ఎన్ని వున్నాయో నష్టాలు కూడా అన్నే వున్నాయి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి చాలామంది టీనేజ్ పిల్లలు తాము ఏం చేస్తున్నామో పట్టించుకోవడంలేదు. మరికొందరైతే సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవికాకుండా సెల్ ఫోన్ల కోసం పిల్లల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు పోయాయి.
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన 13 ఏళ్ల గోరంట్ల విజయలక్ష్మి ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో తల్లి, అన్నయ్యలతో కలిసి అమ్మమ్మగారి ఊరు ఉప్పలపాడుకు వచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య మంగళవారం నాడు స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో తోపులాట జరిగింది. తనకు ఫోన్ చూపించాలంటూ విజయలక్ష్మి అన్నయ్యను అడిగింది. 
 
అందుకు అతడు ససేమిరా అనడమే కాకుండా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న చెల్లెల్ని బలంగా తోసేశాడు. అంతే... ఆమె తల నేలకి బలంగా తగిలింది. దీంతో ఆమె పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విజయలక్ష్మి క్రీడల్లో ఛాంపియన్‌గా పలు బహుమతులు అందుకుంది. కేవలం స్మార్ట్ ఫోన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటిల్లపాది శోకంలో మునిగిపోయారు.‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments