Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అధికారంలోకి రావాలా? ఆంధ్రులపై మరో 10 లక్షల కోట్లు భారం వేయడానికా?: షర్మిల

ఐవీఆర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (22:02 IST)
జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డికి ఇక ఎన్నటికీ అధికారం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... '' జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా? ఎందుకు రావాలి. 10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి రావాలా? ఏపీని ఇంకా అప్పుల్లో ముంచేయడానికి రావాలా? కొండలు కొండలు గొరిగేసి ప్యాలెస్‌లు కట్టుకోవడానికి రావాలా? పూర్తి మద్యపాన నిషేదం అని చెప్పి మోసం చేసినందుకు మళ్లీ రావాలా?
 
ఒకసారి ప్రజలు వైసిపికి అవకాశం ఇచ్చి చూసారు. దేవుడు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లు ప్రజలు ఇచ్చారు. కానీ వైసిపి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ అధికారం అనేది దక్కదు. వైసిపి అనేది ఎన్నటికీ అధికారంలోకి రాని పార్టీగా మిగిలిపోతుంది. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం లేకుండా పోయింది. తమ చిన్నాన్న వైఎస్ వివేక హత్య విషయంలో గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఆశతో సునీత హోంమంత్రిని కలిసారు" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments