Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అధికారంలోకి రావాలా? ఆంధ్రులపై మరో 10 లక్షల కోట్లు భారం వేయడానికా?: షర్మిల

ఐవీఆర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (22:02 IST)
జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డికి ఇక ఎన్నటికీ అధికారం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ... '' జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా? ఎందుకు రావాలి. 10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి రావాలా? ఏపీని ఇంకా అప్పుల్లో ముంచేయడానికి రావాలా? కొండలు కొండలు గొరిగేసి ప్యాలెస్‌లు కట్టుకోవడానికి రావాలా? పూర్తి మద్యపాన నిషేదం అని చెప్పి మోసం చేసినందుకు మళ్లీ రావాలా?
 
ఒకసారి ప్రజలు వైసిపికి అవకాశం ఇచ్చి చూసారు. దేవుడు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లు ప్రజలు ఇచ్చారు. కానీ వైసిపి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ అధికారం అనేది దక్కదు. వైసిపి అనేది ఎన్నటికీ అధికారంలోకి రాని పార్టీగా మిగిలిపోతుంది. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం లేకుండా పోయింది. తమ చిన్నాన్న వైఎస్ వివేక హత్య విషయంలో గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఆశతో సునీత హోంమంత్రిని కలిసారు" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments